నెపోటిజం విమర్శలపై బాలీవుడ్ పెద్దల కౌంటర్ అటాక్..!
ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపొటిజం గురించి విమర్శలు ఎప్పుడూ ఉండేవే. స్టార్ కిడ్స్ వాటిని లైట్ తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఐతే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సుశాంత్ సూసైడ్ ఈ అంశంపై ప్రకంపనలు రేపింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపొటిజం గురించి విమర్శలు ఎప్పుడూ ఉండేవే. స్టార్ కిడ్స్ వాటిని లైట్ తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఐతే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సుశాంత్ సూసైడ్ ఈ అంశంపై ప్రకంపనలు రేపింది. బాలీవుడ్లో స్టార్ కిడ్స్, వాళ్ల పేరెంట్స్ ఒక మాఫియాలా తయారై రియల్ టాలెంట్ను తొక్కేస్తున్నారని అభియోగాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ ఆలియా భట్, సోనమ్ కపూర్ లాంటి ప్రముఖులు ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. ఐతే ఈ విషయంలో సల్మాన్ తెలివిగా వ్యవహరించాడు. సుశాంత్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకోవాలంటూ తన అభిమానులకు పిలుపునిచ్చి తన హుందాతనాన్ని చాటుకున్నాడు.
మరోవైపు సోనాక్షి సిన్హా ఏమో.. ఈ విమర్శలు తట్టుకోలేక తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది . ఐతే కొందరు మాత్రం ఈ విమర్మలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. సోనమ్ కపూర్ ఇటీవల నెపోటిజం విమర్శలకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. ఎవరి బర్త్ ఎక్కడ ఉంటుంది అన్నది ‘కర్మ’ నిర్ణయిస్తుందని.. తాను అనిల్ కపూర్ కూతురిగా ఉండటాన్ని గౌరవంగా భావిస్తానని.. దీనికి సిగ్గుపడేది లేదని కామెంట్స్ చేసింది. తాజాగా ఆలియా భట్ మీద వస్తున్న విమర్శలకు ఆమె తల్లి సోనీ రజ్దాన్ రెస్పాండ్ అయ్యింది. ‘‘ఫలానా వారి బిడ్డలు అంటే ప్రేక్షకులకు కొన్ని అంచనాలుంటాయి. వాటిని చేరుకోడానికి చాలా కష్టపడాలి. ఈ రోజు నెపోటిజం గురించి కామెంట్స్ చేస్తోన్న వాళ్లు ఏదో ఒక రోజు తమ సొంత పిల్లల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. తమ బిడ్డలు పరిశ్రమలోకి ఆపగలుగుతారా అని వారిని’’ అని ఆమె ప్రశ్నించింది.