చైనాను చీలిస్తే.. శరీరాలు ఛిద్రం చేస్తాం.. జీ జిన్ పింగ్ వార్నింగ్
తమ దేశాన్ని చీల్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగినా ఇందుకు కారకులైనవారి శరీరాలను ఛిద్రం చేస్తామని, వారి ఎముకల్ని పిండి చేస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనా (బీజింగ్) కు వ్యతిరేకంగా హాంకాంగ్ లో నాలుగు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో నేపాల్ లో పర్యటించిన జిన్ పింగ్ ఈ హెచ్ఛరిక చేశారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. మా దేశంలోని […]
తమ దేశాన్ని చీల్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగినా ఇందుకు కారకులైనవారి శరీరాలను ఛిద్రం చేస్తామని, వారి ఎముకల్ని పిండి చేస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనా (బీజింగ్) కు వ్యతిరేకంగా హాంకాంగ్ లో నాలుగు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో నేపాల్ లో పర్యటించిన జిన్ పింగ్ ఈ హెచ్ఛరిక చేశారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. మా దేశంలోని ఏ భాగాన్నయినా రెండు భాగాలుగా చీల్చడానికి ఎవరు ప్రయత్నించినా.. వారి అంతు చూస్తామని, వారి శరీరాలను ముక్కలు చేసి.. వారి ఎముకలను పిండి చేస్తామని ఆయన అన్నారు. మా దేశ ప్రజలు కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా పేరు పెట్టి జిన్ పింగ్ ఏ దేశాన్నీ ప్రస్తావించకపోయినప్పటికీ.. హాంకాంగ్ లో మళ్ళీ ఆదివారం అల్లర్లు రేగిన నేపథ్యంలో.. ఆగ్రహంతో ఆయన ఈ హెచ్ఛరిక చేసినట్టు భావిస్తున్నారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య చెలరేగిన ఘర్షణలతో ఆ నగరం తిరిగి అట్టుడికింది. స్వయం పాలిత తైవాన్ మళ్ళీ ఉద్రిక్తంగా మారుతోంది. అనేక చోట్ల నిరసనకారులు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రైలు పట్టాలను ధ్వంసం చేయడమే గాక.. చైనా అనుకూల వ్యాపారులపై, వారి షాపులపై దాడులు చేశారు. ఈ సెమి-అటానమస్ నగరంలో అల్లర్లను కొన్ని విదేశీ శక్తులు రెచ్చగొడుతున్నాయని చైనా ఆరోపిస్తోంది. వీటిని అణచివేసేందుకు తన సైనిక దళాలను చైనా పంపవచ్చునని వార్తలు వస్తున్నప్పటికీ.. హాంకాంగ్ పోలీసులే వాటికి చెక్ పెట్టగలరని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.