ఇద్దరు ట్రాన్స్జెండర్లు సహా ముగ్గురి హత్య, రీజన్ ఏంటంటే
తమిళనాడులోని పాలయంకోట్టై వద్ద ఉన్న బావిలో శుక్రవారం ఇద్దరు ట్రాన్స్జెండర్స్తో పాటు మరో వ్యక్తి డెడ్బాడీలను పోలీసులు వెలికితీశారు.
తమిళనాడులోని పాలయంకోట్టై వద్ద ఉన్న బావిలో శుక్రవారం ఇద్దరు ట్రాన్స్జెండర్స్తో పాటు మరో వ్యక్తి డెడ్బాడీలను పోలీసులు వెలికితీశారు. ఈ కేసుకు సంబంధించి వెంటనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాత గొడవలకు సంబంధించి ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గిరిని గొంతు కోసి హతమార్చిన అనంతరం ముతక సంచుల్లో మృతదేహాలను కూర్చి బావిలో వేసినట్టు గుర్తించారు. మృతులు అనుష్క (35), భవానీ (34), మురుగన్ (38) గా గుర్తించారు. మురుగన్ ఇద్దరినీ (అనుష్క, భవానీ) వివాహం చేసుకున్నారని వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలనుకున్నారు. అందుకోసం సేలం రిషికేశ్ అనే వ్యక్తిని అప్రోచ్ అయ్యారు. ఇందుకోసం అతడు 5 లక్షల రూపాయలు చెల్లించిమని కోరాడు. అందుకు సరే అన్న మురుగన్ దంపతులు..ఆ డబ్బు చెల్లించారు. అయితే రిషికేశ్ డబ్బు అందుకున్నాక, వారిని మోసం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో, మురుగన్ సోషల్ మీడియాలో రిషికేశ్ ఛీటర్ అంటూ కాస్త ఘాటుగా పోస్టులు పెట్టాడు. దీనితో విరుచుకుపడిన రిషికేశ్, అతని ఇద్దరు సహచరులు మురుగన్ ట్రాన్స్జెండర్లను చంపేశాడు. అనంతరం వారి మృతదేహాలను ముతక సంచుల్లో ప్యాక్ చేసి హైవే సమీపంలోని బావిలో పడేశారు. అనుష్క, భవానీలు ఆచూకి తెలియడం లేదని కొందరు ట్రాన్స్జెండర్లు పోలీసులను అప్రోచ్ అవ్వగా అసలు విషయం వచ్చింది.
Also Read :
ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ