బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. కరోనా పర్సనల్ లోన్
ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ బీఓబీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ బీఓబీ(బ్యాంక్ ఆఫ్ బరోడా) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందేలా అవకాశం కల్పించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కరోనా పర్సనల్ లోన్ కింద రుణాలు అందజేయనుంది. వడ్డీ రేట్లుకూడా తక్కువగా ఉంటాయని పేర్కొంది. ఇందులో రూ. 25వేల నుండి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందేలా అవకాశం కల్పించింది. కోవిడ్ 19 పర్సనల్ లోన్స్పై వడ్డీ రేటు.. బీఆర్ఎల్ఎల్ఆర్ + ఎస్పీ + 2.75 శాతంగా ఉంటుంది. ఇకపోతే ప్రిపేమెంట్ చార్జీలు ఉండవు. ప్రాసెసింగ్ ఫీజు రూ.500గా ఉంటుంది. జీఎస్టీ వర్తిస్తుంది. కనీసం రూ.25,000 రుణం తీసుకోవలసి ఉంటుంది. అయితే, సిబిల్ స్కోర్ 650కు పైన ఉండాలి. అలాగే తీసుకున్న రుణ మొత్తాన్ని 60 నెలలలోగా తిరిగి చెల్లించాలి. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ తరహా రుణాలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ కోవిడ్ 19 స్పెషల్ పర్సనల్ లోన్కు సంబంధించిన పూర్తి వివరాలు తమ బ్యాంక్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.