మంత్రాలతో రోగం నయమవుతుందని నమ్మి, ఓ నిండు ప్రాణం బలి
టెక్నాలజీ విషయంలో ఎంత ముందుకు వెళ్తున్నా..మూఢ నమ్మకాలు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాడు. తాజాగా మంత్రాలతో రోగం నయమవుతుందని వెళ్తే ఓ నిండు ప్రాణమే బలైంది.
టెక్నాలజీ విషయంలో ఎంత ముందుకు వెళ్తున్నా..మూఢ నమ్మకాలు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాడు. తాజాగా మంత్రాలతో రోగం నయమవుతుందని వెళ్తే ఓ నిండు ప్రాణమే బలైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల వేదన వర్ణణాతీతంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..నందివనపర్తి గ్రామానికి మహేశ్ అనే యువకుడు దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడిని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బందిపడసాగాడు. ఎన్ని ఆస్పత్రులు తిగిరినా ఉపయోగం లేకపోవడంతో బంధువులు సలహాలతో శ్రీహరి మంత్రగాడిని ఆశ్రయించాడు. అతడు ఏదో పటం గీసి, నాలుగు మంత్రాలు చదివి…ఆరోగ్యం బాగు అయ్యేలా చేస్తానని.. అందుకు రూ.20 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అందులో రూ. 10 వేలు అడ్వాన్స్ కింద తీసుకున్నాడు. అతడికి కొన్ని నాటు మందులు కూడా ఇచ్చాడు.
అయితే ఆ మందులు, మంత్రాలకు రోగం నయం కాకపోగా ఆరోగ్యం క్షీణించి గత రాత్రి మృతి చెందాడు మహేష్. 7 నెలల క్రితమే మహేష్కు పెళ్లి కాగా, ప్రస్తుతం అతడి భార్య 6 నెలల గర్భవతి. మంత్రగాడు చెప్పినట్టు విని.. తన భర్త లేకుండా పోయాడని ఆమె కన్నీరమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!