బెంగాల్ రక్తసిక్తం.. బీజేపీ నేతలే టార్గెట్
నిరసనలు, హత్యలు, దాడులతో బెంగాల్ నిత్యం అట్టుడుకుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి మొదలైన హింస.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు వరుసగా హత్యకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళా నాయకురాలిని దారుణంగా చంపేశారు కొందరు దుండగులు. బెంగాల్లోని బషీరత్లో బీజేపీ మహిళా నేత సరస్వతి దాస్ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాల్పడింది టీఎంసీ గుండాలేనంటూ.. బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు […]
నిరసనలు, హత్యలు, దాడులతో బెంగాల్ నిత్యం అట్టుడుకుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి మొదలైన హింస.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు వరుసగా హత్యకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళా నాయకురాలిని దారుణంగా చంపేశారు కొందరు దుండగులు. బెంగాల్లోని బషీరత్లో బీజేపీ మహిళా నేత సరస్వతి దాస్ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాల్పడింది టీఎంసీ గుండాలేనంటూ.. బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలంటూ వారు డిమాండ్ చేశారు.
Saraswati Das, BJP worker was brutally shot dead by TMC goons in Basirhat.
Law and order has totally collapsed in West Bengal where no one is safe. @mamataofficial is also home minister of West Bengal. pic.twitter.com/DWNfDWNnm9
— BJP Bengal (@BJP4Bengal) June 13, 2019