బీజేపీ ధన బలం, బెదిరింపులతో ప్రభుత్వాల్ని కూల్చేస్తోంది

ధన బలం, బెదిరింపులతో ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓ కేసు విచారణలో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ కోర్టుకు హాజరైన రాహుల్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ డబ్బులు వెదజల్లి, బెదిరింపులకు పాల్పుడుతూ ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని మండిపడ్డారు. గోవాలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూశారని.. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పని చేస్తున్నారన్నారు. బీజేపీ పద్ధతి ఇదే అని.. వారి వద్ద డబ్బు, […]

బీజేపీ ధన బలం, బెదిరింపులతో ప్రభుత్వాల్ని కూల్చేస్తోంది
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:42 PM

ధన బలం, బెదిరింపులతో ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓ కేసు విచారణలో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ కోర్టుకు హాజరైన రాహుల్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ డబ్బులు వెదజల్లి, బెదిరింపులకు పాల్పుడుతూ ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని మండిపడ్డారు. గోవాలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూశారని.. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పని చేస్తున్నారన్నారు. బీజేపీ పద్ధతి ఇదే అని.. వారి వద్ద డబ్బు, అధికారం ఉందని.. ఆ రెండిటినీ ప్రయోగిస్తూ.. ప్రభుత్వాలను కూల్చేస్తుందని అన్నారు.