బీజేపీ నుంచి తిరిగి టీఎంసీలోకి…
కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన 10 మంది తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు తిరిగి టీఎంసీలో చేరారని ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లును బెదిరించి, బలవంతంగా బీజేపీలో చేర్చుకున్నారని ఆయన ఆరోపించారు. పది మంది కౌన్సిలర్లు తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో చేరడం ద్వారా రెండు మున్సిపాలిటీలలో టీఎంసీ బలం పెరిగిందని ఆయన వెల్లడించారు. అయితే… సార్వత్రిక ఎన్నికల సమయంలో దాదాపు 50 మంది […]
కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన 10 మంది తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు తిరిగి టీఎంసీలో చేరారని ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లును బెదిరించి, బలవంతంగా బీజేపీలో చేర్చుకున్నారని ఆయన ఆరోపించారు. పది మంది కౌన్సిలర్లు తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో చేరడం ద్వారా రెండు మున్సిపాలిటీలలో టీఎంసీ బలం పెరిగిందని ఆయన వెల్లడించారు. అయితే… సార్వత్రిక ఎన్నికల సమయంలో దాదాపు 50 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన దాదాపు 107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ముకుల్రాయ్ తాజాగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపుతున్నాయి.