రాజస్తాన్ సంక్షోభం, గుజరాత్ కు 6 గురు బీజేపీ ఎమ్మెల్యేల తరలింపు

రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 14 నుంచి సమావేశం కానుండగా.. రాష్ట్ర బీజేపీ శాఖ తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను గుజరాత్ లోని పోర్ బందర్ కి తరలించింది. వీరు జైపూర్ విమానాశ్రయం నుంచి శనివారం ఓ చార్టర్డ్ విమానంలో గుజరాత్ కి బయల్దేరి వెళ్లారు.

రాజస్తాన్ సంక్షోభం, గుజరాత్ కు 6 గురు బీజేపీ ఎమ్మెల్యేల తరలింపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2020 | 1:25 PM

రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 14 నుంచి సమావేశం కానుండగా.. రాష్ట్ర బీజేపీ శాఖ తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను గుజరాత్ లోని పోర్ బందర్ కి తరలించింది. వీరు జైపూర్ విమానాశ్రయం నుంచి శనివారం ఓ చార్టర్డ్ విమానంలో గుజరాత్ కి బయల్దేరి వెళ్లారు. యధాప్రకారం వీరు ఆ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని ఇతర టూరిస్టు ప్రదేశాలను  సందర్శించవచ్ఛు. కాగా 12 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 7 వ తేదీన అహమ్మదాబాద్ వెళ్లారని పార్టీవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ మాదిరి తమ పార్టీ కూడా రిసార్టులకు, లగ్జరీ హోటళ్లకు తమ ఎమ్మెల్యేలను తరలించడం ప్రారంభించిందన్న ఆరోపణలను రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా ఖండించారు. మా సభ్యులంతా ఐక్యంగా ఉన్నారని, నాయకత్వం పట్ల అసమ్మతి లేదా అవిశ్వాసం అన్న ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.

రేపో మాపో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం.. దానికి ఎమ్మెల్యేలంతా హాజరవుతారు అని పూనియా తెలిపారు. ఇక సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలంతా ఇంకా జైసల్మీర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ‘సేద’  దీరుతున్నారు.