చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదాకు ‘గ్రహణం’ – రాంమాధవ్

2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేసి ప్రచారం చేయడం వల్లే ఏపీలో తాము ఓడిపోయామని బీజేపీ ప్రధాన జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదు తెలంగాణాలో కూడా నష్టపోయామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో తాము గెలిచిన నాలుగు స్థానాల్లో సెటిలర్ల ఓట్లు బీజేపీకి పడలేదన్నారు. ఇక్కడ ఉన్న సెటిలర్లు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని […]

చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదాకు 'గ్రహణం' - రాంమాధవ్
Follow us

|

Updated on: Jun 06, 2019 | 1:47 PM

2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేసి ప్రచారం చేయడం వల్లే ఏపీలో తాము ఓడిపోయామని బీజేపీ ప్రధాన జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదు తెలంగాణాలో కూడా నష్టపోయామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో తాము గెలిచిన నాలుగు స్థానాల్లో సెటిలర్ల ఓట్లు బీజేపీకి పడలేదన్నారు. ఇక్కడ ఉన్న సెటిలర్లు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నారని.. అది ఇవ్వకపోవడం వల్లే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ మోసం చేసిందంటూ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంపై ఇలాంటి మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే…