తెలంగాణ జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే!

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలోని 12 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.ప్రేమేందర్ రెడ్డి మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు.

తెలంగాణ జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే!
Follow us

|

Updated on: Sep 22, 2020 | 4:58 PM

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలోని 12 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.ప్రేమేందర్ రెడ్డి మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. అయితే అనూహ్యంగా హైదరాబాద్ సిటీకి నలుగురు అధ్యక్షులను నియమించి అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే.. వీరు జోన్ల వారీగా పని చేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

మహంకాళీ సికింద్రాబాద్‌కు శ్యామ్ సుందర్ గౌడ్, గోల్గొండ గోషామహాల్‌కు పాండు యాదవ్, బాగ్యనగర్ మలక్ పేట్‌కు సాంరెడ్డి సుధీర్ రెడ్డి, బర్కతపుర అంబర్ పేట్‌కు గౌతమ్ రావులను అధ్యక్షులుగా నియమించారు. మేడ్చల్ (రూరల్) జిల్లాకు విక్రమ్ రెడ్డి, కామారెడ్డికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, రంగారెడ్డి అర్బన్ జిల్లాకు సామరంగారెడ్డి, జగిత్యాలకు పైడిపల్లి సత్యనారాయణ రావు, మేడ్చల్ (అర్బన్)కు పన్నాల హరీష్ రెడ్డి, ఖమ్మంకు గల్లా సత్యనారాయణ, సూర్యపేటకు బొబ్బా భాగ్యరెడ్డి, వికారాబాద్ జిల్లాకు సదానందరెడ్డిలను అధ్యక్షులుగా నియమించారు. మిగిలిన జిల్లాలపై అధ్యక్షుని కసరత్తు కొనసాగుతోందని బీజేపీ వర్గాలు తెలిపాయి.