బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై బీజేపీ పార్లమెంటరీ బోర్డుదే నిర్ణయం
బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో సీట్ల పంపిణీపై బీజేపీ పార్లమెంటరీ బోర్డే నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే లోని అన్ని భాగస్వామ్య పక్షాలూ కలిసికట్టుగా.
బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో సీట్ల పంపిణీపై బీజేపీ పార్లమెంటరీ బోర్డే నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే లోని అన్ని భాగస్వామ్య పక్షాలూ కలిసికట్టుగా పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. బీజేపీ-జేడీ-యూ మధ్య చెరి సగం సీట్ల పంపిణీని అమలు చేస్తామని ఆయన అన్నారు. బీహార్ లో వచ్ఛే అక్టోబరు-నవంబరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసీ ఎన్నికల షెడ్యూలు ప్రకటనను వాయిదా వేసింది. అలాగే మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉపఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి.