ఆ భ్రమతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి చేశారు: సోము వీర్రాజు
పోలవరం ప్రాజెక్ట్కు చంద్రబాబు తూట్లు పొడిచారంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తాననే భ్రమతో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి చేశారని.. పోలవరం అథారిటీని కూడా పనిచేయనివ్వలేదని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఇళ్ల పంపిణీలో రూ.6వేల కోట్ల అవినీతి జరిగిందని..ఇళ్ల స్కామ్పై సమగ్ర విచారణ జరపాలని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. ఇప్పుడు ఆ పార్టీని చంద్రబాబు కాంగ్రెస్తోనే కలిపేశారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, […]
పోలవరం ప్రాజెక్ట్కు చంద్రబాబు తూట్లు పొడిచారంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తాననే భ్రమతో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి చేశారని.. పోలవరం అథారిటీని కూడా పనిచేయనివ్వలేదని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఇళ్ల పంపిణీలో రూ.6వేల కోట్ల అవినీతి జరిగిందని..ఇళ్ల స్కామ్పై సమగ్ర విచారణ జరపాలని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. ఇప్పుడు ఆ పార్టీని చంద్రబాబు కాంగ్రెస్తోనే కలిపేశారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.