అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై బీజేపీ నేతలు పలు పోలీస్టేషన్‌లలో కేసులు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పీస్‌లో కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే కరీంనగర్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు ఆపార్టీ నేతలు. అదేవిధంగా మహబూబ్‌నగర్ టూటౌన్ పీఎస్‌లో కూడా అక్బర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగంలో.. ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. […]

అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 2:57 PM

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై బీజేపీ నేతలు పలు పోలీస్టేషన్‌లలో కేసులు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పీస్‌లో కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే కరీంనగర్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు ఆపార్టీ నేతలు. అదేవిధంగా మహబూబ్‌నగర్ టూటౌన్ పీఎస్‌లో కూడా అక్బర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగంలో.. ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తూ విమర్శించారని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.