హర్యానాలో రెచ్చిపోయిన బీజేపీ నేత..
హర్యానాలో ఓ బీజేపీ నేత రెచ్చిపోయాడు. అధికారం చేతిలో ఉందన్న మధంతో వీరంగం సృష్టించాడు. హర్యానాకి చెందిన బీజేపీ నేత సతీష్ కొండ.. రేవారి రహదారిపై ప్రయాణిస్తున్నాడు. అయితే ఆయన రాంగ్ రూట్లో వెళ్లటాన్ని గమనించిన ఓ హోంగార్డ్.. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి.. తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ బీజేపీ నేత.. హోం గార్డును అదే కారుతో ఢీ కొట్టాడు. దాదాపు అరకిలో […]
హర్యానాలో ఓ బీజేపీ నేత రెచ్చిపోయాడు. అధికారం చేతిలో ఉందన్న మధంతో వీరంగం సృష్టించాడు. హర్యానాకి చెందిన బీజేపీ నేత సతీష్ కొండ.. రేవారి రహదారిపై ప్రయాణిస్తున్నాడు. అయితే ఆయన రాంగ్ రూట్లో వెళ్లటాన్ని గమనించిన ఓ హోంగార్డ్.. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి.. తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ బీజేపీ నేత.. హోం గార్డును అదే కారుతో ఢీ కొట్టాడు. దాదాపు అరకిలో మీటర్ వరకు లాక్కెళ్లాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డును ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కారుతో వీరంగం సృష్టించిన బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కారుతో ఢీకొట్టిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ నేత తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.