కాంగ్రెస్ ఐసీయూలో ఉంది.. గాంధీ భవన్కు బుల్లెట్ బోర్డే: లక్ష్మణ్ ఎద్దేవా
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, కాంగ్రెస్ ఐసీయూలో ఉందని, గాంధీభవన్కు బుల్లెట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ఉత్తమ్ కుమార్రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు. తమ వ్యాపారాల కోసం టీఆర్ఎస్లో చేరి లోపాయికారి ఒప్పందాలతో ప్రజలకు ద్రోహం చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఎదుర్కోవడం చేతకాక కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఏకమై […]
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, కాంగ్రెస్ ఐసీయూలో ఉందని, గాంధీభవన్కు బుల్లెట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ఉత్తమ్ కుమార్రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు. తమ వ్యాపారాల కోసం టీఆర్ఎస్లో చేరి లోపాయికారి ఒప్పందాలతో ప్రజలకు ద్రోహం చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఎదుర్కోవడం చేతకాక కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఏకమై బీజేపీ అధికారంలోకి రాకుండా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. బీజేపీని ఏ శక్తి అడ్డుకోలేదని, 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని.. పుచ్చిపోవడం ఖాయం అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.