కేసీఆర్పై కిషన్ రెడ్డి విసుర్లు
హైదరాబాద్: మహిళలపై వివక్ష చూపుతున్న కేసీఆర్పై షీ టీమ్ కేసు పెట్టాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. మహిళలు, గిరిజనులపై కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. గత కేబినెట్ లాగానే ప్రస్తుతం కూడా మహిళలకు ప్రాధాన్యత లేకపోవడం నిజంగా బాధాకరమని కిషన్ రెడ్డి అన్నారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని దేశప్రజలందరు ఖండిస్తుంటే మమతాబెనర్జీ, చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్: మహిళలపై వివక్ష చూపుతున్న కేసీఆర్పై షీ టీమ్ కేసు పెట్టాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. మహిళలు, గిరిజనులపై కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. గత కేబినెట్ లాగానే ప్రస్తుతం కూడా మహిళలకు ప్రాధాన్యత లేకపోవడం నిజంగా బాధాకరమని కిషన్ రెడ్డి అన్నారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని దేశప్రజలందరు ఖండిస్తుంటే మమతాబెనర్జీ, చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.