రాష్ట్రాన్ని నిండా ముంచేసి పోయారు: కన్నా
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను టార్గెట్ చేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వరదల సమయంలో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్ళారని ఆరోపించారాయన. ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు.. తన కొంప మునిగిపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రం నిండా మునుగుతోందని ట్విట్టర్లో కామెంట్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని […]
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను టార్గెట్ చేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వరదల సమయంలో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్ళారని ఆరోపించారాయన. ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు.. తన కొంప మునిగిపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రం నిండా మునుగుతోందని ట్విట్టర్లో కామెంట్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ.
రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన ‘కొంప మునిగి’ హైదరాబాద్ జారుకున్నాడు.. వారిద్దరి ‘తోక నేతలు’చేస్తున్న చర్చ”ఇల్లు మునిగిందా,లేదా”? ఇల్లు సంగతి వదిలేయండి మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది. pic.twitter.com/cx2Gufcsat
— Kanna Lakshmi Narayana (@klnbjp) August 17, 2019