బీజేపీ నేత కుటుంబాన్ని కాల్చిచంపిన ఉగ్రవాదులు.. 8 మంది సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్..
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మొత్తం 8 మంది రక్షణ సిబ్బంది ఉన్నా
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మొత్తం 8 మంది రక్షణ సిబ్బంది ఉన్నా ఘటనా సమయంలో ఒక్కరూ లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. వసీం బారి కుటుంబాన్ని పథకం ప్రకారం కుట్రపూరితంగా కాల్చిచంపారని జమ్మూకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ ఆరోపించారు.
కాగా.. వసీం బారికి రక్షణ కల్పిస్తోన్న మొత్తం 8 మంది రక్షణ సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. బందిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడైన వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్చిచంపారు. వసీం బారి దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దుకాణం సరిగ్గా పోలీస్ స్టేషన్కు ఎదురుగానే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ వసీం బారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
[svt-event date=”08/07/2020,11:16PM” class=”svt-cd-green” ]
Over the telephone, Prime Minister Narendra Modi enquired about the gruesome killing of Wasim Bari. He also extended condolences to the family of Wasim: Dr Jitendra Singh, MoS Prime Minister’s Office (PMO) https://t.co/kWv0TY8YLU pic.twitter.com/x37ct9pnUU
— ANI (@ANI) July 8, 2020
[/svt-event]