బీజేపీలో చేరిన రెబెల్ ఎమ్మెల్యేలు.. కాబోయే మంత్రులట
కర్నాటకలో గత జులైలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ-ఎస్ కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీలో చేరారు. నాడు వీరి తిరుగుబాటుతో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం కుప్పకూలగా.. బీజేపీ నేత ఎదియూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ‘ అనర్హ ‘ ఎమ్మెల్యేలు రాజీనామాల కారణంగా . వీరి 15 నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 5 న జరిగే ఆ […]
కర్నాటకలో గత జులైలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ-ఎస్ కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీలో చేరారు. నాడు వీరి తిరుగుబాటుతో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం కుప్పకూలగా.. బీజేపీ నేత ఎదియూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ‘ అనర్హ ‘ ఎమ్మెల్యేలు రాజీనామాల కారణంగా . వీరి 15 నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 5 న జరిగే ఆ ఎన్నికల్లో వీరు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారని ఎదియూరప్ప ప్రకటించారు. పైగా భవిష్యత్తులో వీరు మంత్రులు అవుతారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ సభ్యుల అనర్హతను సుప్రీంకోర్టు నిన్న ధృవీకరించిన సంగతి తెలిసిందే. పార్టీలో ఈ రెబెల్ సభ్యుల చేరికను ఎదియూరప్ప స్వాగతిస్తూ.. తమ పదవులకు రాజీనామాలు చేసిన వీరి త్యాగం మరువలేనని అన్నారు. వారికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్పారు.