ఝార్ఖండ్ ‘డైనమైట్’పై బీజేపీ చూపు..?
తానెప్పుడు రిటైర్ అవుతానో తనకే స్పష్టత లేదని టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఇదివరకే ప్రకటించాడు. అయినా.. ఈ ప్రపంచకప్ తరువాత ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడనే కథనాలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తరువాత ధోని రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు బీజేపీ అభిమానులు తెగ ప్రచారం చేస్తూ.. తమ పార్టీలోకి ధోని వస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు జాతీయ పత్రికల్లోనూ ధోని వార్త హాట్టాపిక్గా మారింది. […]
తానెప్పుడు రిటైర్ అవుతానో తనకే స్పష్టత లేదని టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఇదివరకే ప్రకటించాడు. అయినా.. ఈ ప్రపంచకప్ తరువాత ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడనే కథనాలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తరువాత ధోని రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు బీజేపీ అభిమానులు తెగ ప్రచారం చేస్తూ.. తమ పార్టీలోకి ధోని వస్తాడని అంటున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు జాతీయ పత్రికల్లోనూ ధోని వార్త హాట్టాపిక్గా మారింది. ఈ ఏడాది అక్టోబర్లో ఝార్ఖండ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ధోని ప్రచారం చేస్తాడని.. ఇంగ్లండ్ నుంచి భారత్కు రాగానే ధోని బీజేపీలో చేరుతాడని ఓ పత్రిక రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఝార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. ఆ పార్టీలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనిని వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందట. ఒక వేళ పార్టీలో చేరేందుకు ధోని ఇష్టపడకపోతే కనీసం ప్రచారానికైనా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.