ఏపీపై కమలం గురి.. మంగళగిరిలో కీలక నేతల రహస్య భేటీ
ఏపీ నుంచి పార్టీలో చేరే వారికి ఆహ్వానం పలుకుతుంది బీజేపీ. పార్టీలోకి వచ్చేవారెవరు..? వారి రాక పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది.. ? వారి బ్యాగ్ గ్రౌండ్ ఏంటనే దానిపై ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇందులో భాగాంగా గుంటూరు జిల్లా మంగళగిరి హాయ్ ల్యాండ్లో రహస్యంగా భేటీ అయ్యారు బీజేపీ నేతలు. ఇతర పార్టీల నేతలపై సమావేశంలో చర్చించారు. సుమారు 75 మంది కీలక నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు కమలనాథులు. కమలం కండువా […]
ఏపీ నుంచి పార్టీలో చేరే వారికి ఆహ్వానం పలుకుతుంది బీజేపీ. పార్టీలోకి వచ్చేవారెవరు..? వారి రాక పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది.. ? వారి బ్యాగ్ గ్రౌండ్ ఏంటనే దానిపై ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇందులో భాగాంగా గుంటూరు జిల్లా మంగళగిరి హాయ్ ల్యాండ్లో రహస్యంగా భేటీ అయ్యారు బీజేపీ నేతలు. ఇతర పార్టీల నేతలపై సమావేశంలో చర్చించారు. సుమారు 75 మంది కీలక నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు కమలనాథులు.
కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నవారి రాజకీయ ప్రస్థానం, క్రిమినల్ యాక్టివిటీపై చర్చిస్తున్నారు. ఏపీలో బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జులై 6 నుంచి 11 వరకు సంఘటనా పర్వ్ పేరుతో సభ్యత్వ నమోదుకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్, మాజీ మంత్రి పురందేశ్వరి సమావేశంలో పాల్గొన్నారు.