టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. బీజేపీ సభ్యుడు హతం

ఎంపీటీసీ ఫలితాలు.. మహబూబ్ నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో డోకూరు గ్రామంలో బీజేపీ అభ్యర్థి యజ్ఞం భూపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా సాయంత్రం బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో.. టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవ జరిగింది. బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్‌ అనే కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే […]

టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. బీజేపీ సభ్యుడు హతం
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2019 | 3:27 PM

ఎంపీటీసీ ఫలితాలు.. మహబూబ్ నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో డోకూరు గ్రామంలో బీజేపీ అభ్యర్థి యజ్ఞం భూపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా సాయంత్రం బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో.. టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవ జరిగింది. బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్‌ అనే కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.