Bird Flu: రాజస్థాన్లో బర్డ్ ఫ్లూ కలకలం.. మరో 90 పక్షులు మృతి.. ఇప్పటి వరకు ఎన్ని పక్షులు మృతి చెందాయంటే..
Bird Flu: దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ ఇంకా కలకలం రేపుతోంది. తాజాగా రాజస్థాన్లో మరో 90 పక్షులు మృతి చెందినట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ వెల్లడించింది..
Bird Flu: దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ ఇంకా కలకలం రేపుతోంది. తాజాగా రాజస్థాన్లో మరో 90 పక్షులు మృతి చెందినట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ వెల్లడించింది. మృతి చెందిన పక్షుల్లో 56 కాకులు,12 నెమళ్లు, 14 పావురాలు, ఇతర పక్షులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2020 డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కారణంగా రాజస్థాన్లో 6,849 పక్షులు మృత్యువాత పడినట్లు వెల్లడించారు. మృతి చెందిన పక్షుల్లో 4,79 కాకులు, 409 నెమళ్లు, 583 పావురాలు, 1058 ఇతర పక్షులు ఉన్నాయి. 17 జిల్లాల్లో ఏవియస్ఇన్ప్లూయెంజా (బర్డ్ఫ్లూ) నిర్ధారణ అయిందని పశు సంవర్ధక శాఖ తెలిపింది.
కాగా, బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో దేశంలోని పలు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాకపోయినా.. ప్రజలు చికెన్ తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నెల రోజుల కిందట రూ.240 వరకు ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.140కి పడిపోయింది. ఇక బర్డ్ ప్లూ నేపథ్యంలో జాతీయ ఆహార సంస్థ కొన్ని నిబంధనలు కూడా విడుదల చేసింది. చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదని స్పష్టం చేసింది. అయితే మాంసాన్ని బాగా ఉడికించి తినాలని, కోడిగుడ్లను హాఫ్ బాయిల్డ్ తినకూడదని నిబంధనల్లో స్పష్టం చేసింది.
సమయానికి రైలు ఎక్కలేకపోయారా.. అయితే మీ టికెట్ సొమ్ము వాపస్.. అయితే ఈ అవకాశం ఎక్కడో తెలుసా..?