ఏపీలో పింఛన్లు : నేటి నుంచే మళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి
ఏపీలో వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పంపిణీలో మళ్లీ బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది.
ఏపీలో వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పంపిణీలో మళ్లీ బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి క్యాన్సిల్ చేశారు. అయితే సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరోసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇకపై పెన్షన్లు తీసుకునేవారంతా బయోమెట్రిక్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రంలో మరో 80 వేల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు జగన్ సర్కార్ వెల్లడించింది.
బయోమెట్రిక్ ద్వారా నేడు పింఛన్ పంపిణీ
Also Read :
ఆరు వారాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ !