Bike Accident: స్తంభాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం.. మైనర్ బాలుడు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేట నుంచి జగన్ కూడా వైపు వెళ్లే దారిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి స్థంభానికి ఢీకుంది.
Bike Accident: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేట నుంచి మరో ప్రాంతానికి వెళ్లే దారిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్పై వెనుక కూర్చున్న బాలికకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్ప్రత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమం స్థానికుల సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
Fake currency: మంచిర్యాల జిల్లాలో దొంగనోట్ల కలకలం.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి