అమర జవాన్లకు ‘పచ్చబొట్టు’ నివాళి

పుల్వామా ఆత్మాహుతి దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని, ఇలాంటి దాడులు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దాడిలో అమరులైన జవాన్లకు వినూత్నంగా నివాళి ఇచ్చుకున్నాడు ఓ యువకుడు. బికనీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సహరన్ అనే యువకుడు ఉగ్రదాడుల్లో మరణించిన 71 అమర జవాన్ల పేర్లను తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన […]

అమర జవాన్లకు ‘పచ్చబొట్టు’ నివాళి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:02 PM

పుల్వామా ఆత్మాహుతి దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని, ఇలాంటి దాడులు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దాడిలో అమరులైన జవాన్లకు వినూత్నంగా నివాళి ఇచ్చుకున్నాడు ఓ యువకుడు.

బికనీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సహరన్ అనే యువకుడు ఉగ్రదాడుల్లో మరణించిన 71 అమర జవాన్ల పేర్లను తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు వినూత్నంగా నివాళులు అర్పించాలని తాను అనుకున్నానని.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావించి తాను ఈ టాటూ వేయించుకున్నట్లు అతడు తెలిపాడు. కాగా బికనీర్ ప్రాంతంలో ఎంతో క్రియాశీలకంగా ఉన్న భగత్ సింగ్ యూత్ బ్రిగేడ్ సభ్యుడిగా గోపాల్ కొనసాగుతున్నాడు.