కుటుంబంపై కాల్పులు – ముగ్గరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

బీహార్‌లో‌ దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భర్త, భార్య అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ వారి కుమారుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించిన కాసేపటికే కన్నుమూశాడు. ఇక మరో కుమారుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. బీహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లాలోని హత్వా ఏరియాలో ఈ దారుణం జరిగింది. ఆర్జేడీ నాయకుడు జేపీ చౌదరి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉండగా ఐదుగురు […]

కుటుంబంపై కాల్పులు - ముగ్గరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
Follow us

|

Updated on: May 25, 2020 | 9:15 PM

బీహార్‌లో‌ దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భర్త, భార్య అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ వారి కుమారుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించిన కాసేపటికే కన్నుమూశాడు. ఇక మరో కుమారుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. బీహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లాలోని హత్వా ఏరియాలో ఈ దారుణం జరిగింది. ఆర్జేడీ నాయకుడు జేపీ చౌదరి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉండగా ఐదుగురు వ్యక్తులు బైకులపై వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చౌధరి తండ్రి మహేశ్‌ చౌదరి, తల్లి సంఖానియా దేవి అక్కడికక్కడే మరణించారు. సోదరుడు శంతను చౌదరి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జేపీ చౌదరి యూపీలోని గోరక్‌పూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, రాజకీయ కక్షతోనే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల భావిస్తున్నారు. ఈ ఘటనలో జేడీయూ ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు