బిహార్‌ బీజేపీలో కరోనా కల్లోలం.. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు..

బిహార్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడి ప్రజాప్రతినిధులను కూడా తాకుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్‌కి కరోనా..

బిహార్‌ బీజేపీలో కరోనా కల్లోలం.. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు..
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 10:32 PM

బిహార్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడి ప్రజాప్రతినిధులను కూడా తాకుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన తన భార్యకు, తల్లికి కరోనా పరీక్షలు చేయించారు. అయితే పరీక్షల్లో వారికి కూడా పాజిటివ్‌ అని తేలింది. పాట్నాలోని బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌లోని పలువురు బీజేపీ కార్యకర్తలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో సంజయ్‌ జైస్వాల్‌ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సంజయ్ జైస్వాల్ స్వయంగా ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో పలువురు కార్యకర్తలకు పాజిటివ్‌ అని తేలిందని.. ఈ క్రమంలో బాధ్యతాయుత పౌరుడిగా ముందస్తుగా పరీక్షలు చేయించుకున్నానని.. ఈ క్రమంలోనే పాజిటివ్‌ అని తేలిందన్నారు. అయితే కొందరు పార్టీలకు చెందిన నేతలు.. కరోనా కాలంలో కూడా బర్త్‌డే పార్టీలంటూ విచ్చలవిడిగా విందు కార్యక్రమాలు చేపడుతున్నారని.. ఇది సరైంది కాదన్నారు.