గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేత అభిజీత్ 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేత అభిజీత్  మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేత అభిజీత్ 
Follow us

|

Updated on: Dec 22, 2020 | 5:02 PM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేత అభిజీత్  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది  బిగ్ బాస్ 4 విజేత గా నిలిచిన సందర్భంగా ఏదైన మంచి కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడం జరిగింది అని. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ గారికి నా కృతజ్ఞతలు . పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలని అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని అభిజీత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తనతోపాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సోహెల్, హారిక , కళ్యాణి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.