బిగ్ బాస్ సీజన్ 4‌ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఫిక్స్.. మరోసారి టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం..

మరో మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కానుంది. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరు వస్తారన్న...

బిగ్ బాస్ సీజన్ 4‌ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఫిక్స్.. మరోసారి టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం..
Follow us

|

Updated on: Dec 17, 2020 | 9:26 PM

Bigg Boss 4: మరో మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కానుంది. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరు వస్తారన్న దానిపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. మొదటిగా ఎన్టీఆర్ అని కొంతమంది అనగా.. ఆ తర్వాత మహేష్ బాబు అని.. చిరంజీవి, వెంకటేష్ పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా షో నిర్వాహకులు ఫినాలే గెస్ట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సీజన్ ఫినాలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరగనుందని సమాచారం. బిగ్ బాస్ ఫైనల్స్‌కు చిరు గెస్ట్‌గా రావడం ఇది రెండోసారి అవుతుంది. గత సీజన్ ఫైనల్‌లో కూడా చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. షో టీఆర్పీ రేటింగ్స్‌ను అమాంతం పెంచేశారు. మరి ఈసారి ఎలా అలరిస్తారో వేచి చూడాలి. ఇక ఐదుగురు ఫైనలిస్టులలో బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్‌ను ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read:

బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!

పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..

”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..

ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..?