ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పెద్ద అప్ డేట్. !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు త్వరలోనే పెద్ద అప్ డేట్ ఇస్తామంటూ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు త్వరలోనే పెద్ద అప్ డేట్ ఇస్తామంటూ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూవీ ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లోనే ఈ సినిమాను కూడా తెరకెక్కబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్’ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి. పొలిటికల్ ఎంటర్టైనర్గా ఉంటుందని బావిస్తోన్నఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే, ఇది ఎంతవరకూ నిజమో తెలియదు. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంతవరకూ లేదు. దీనిపై ఫ్యాన్స్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో అభ్యర్థిస్తున్నారు. అయితే, ఇన్నాళ్లకి నిర్మాత సూర్యదేవర నాగవంశీ రెస్పాండ్ అయ్యారు. ఫ్యాన్స్ కోసం అదిరియే అప్డేట్ సిద్ధమవుతోందని చెప్పారు.
To all our Young Tiger @tarak9999 anna fans, we have been receiving your messages for an update & we will reveal everything whenever we start shooting. We have a sentiment to not reveal the title prior to that. This time around trust us something very very big is coming your way!
— Naga Vamsi (@vamsi84) August 31, 2020