పోలవరంపై కొత్త పంచాయితీ.. పీపీఏ తప్పుచేసిందా..?

ఏపీ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి జరిగిందని అధికార వైసీపీ ఆరోపిస్తూ.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందంటూ.. ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. […]

పోలవరంపై కొత్త పంచాయితీ.. పీపీఏ తప్పుచేసిందా..?
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 10:53 PM

ఏపీ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి జరిగిందని అధికార వైసీపీ ఆరోపిస్తూ.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందంటూ.. ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరపాలని కేంద్రాన్ని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, వైసీపీ నేత రవిచంద్ర మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. టీడీపీ హయాంలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ నేత పట్టాభి ఆరోపించారు.

15 జూలై 2019 విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకి రాజ్యసభలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ స్పష్టంగా సమాధానం ఇచ్చారని పట్టాభి చెప్పారు. ప్రాజెక్ట‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చిచెప్పారు. 2013 నూతన భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత ఎస్టిమేట్స్ 16 వేల కోట్ల నుంచి 56వేల కోట్లకు పెరిగిన విషయం అందరికీ తెలిసిందేనని పట్టాభి అన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) అనేక సందర్భాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 35 నెలల పాటు కేవలం రూ. 232 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వైసీపీ నేత రవిచంద్ర అన్నారు. అయితే పోలవంర ప్రాజెక్ట్ పెంపుకు పూర్తిగా టీడీపీనే కారణమని.. దీనికి ఏ ఒక్క అధికారి కూడా బాధ్యుడు కాదంటూ వైసీపీ నేత రవిచంద్ర ఆరోపించారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ పెంపు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి.. మంత్రి వర్గంతో ఆమోధించుకున్నారని ఆరోపించారు. హెడ్ వర్క్స్ పనిలో భాగంగా 2016 జనవరి 25న జీవో నంబర్ 13తో.. అప్పటి వరకు రూ. 4054 ఉన్న అంచనాను రూ. 6960 కోట్లకు గతంలో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకే మళ్లీ ఇచ్చారని ఆరోపించారు. ఇక లెఫ్ట్ కెనాల్‌లో హెడ్ వర్క్స్‌ 189 కిలోమీటర్ల ఉంటే 135 కిలో మీటర్లు వైఎస్ఆర్ సమయంలోనే పూర్తయ్యాయని.. దీనికి రూ.1954 కోట్లు ఉన్న అంచనాను రూ.3465 కోట్లకు పెంచి.. మంత్రి వర్గం ఆమోధించిందని ఆరోపించారు. అంతేకాదు.. డిసెంబర్ 2016లో జీవో నంబర్ 117ను విడుదల చేశారని.. అందులో రైట్ కెనాల్‌కు సంబంధించి 177 కిలో మీటర్లు ఉండగా.. ఇందులో 144.3 కిలో మీటర్లు వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయ్యిందని.. దీనికి రూ.2240 కోట్ల అంచనాను రూ.4375 కోట్లు పెంచారని దీనికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. అంతేకాదు పీపీఏ అనుమతి లేకుండానే 2017 ఫిబ్రవరి 6వ తేదీన జీవో నంబర్.41 ద్వారా రూ.6000 కోట్ల నామినేటెడ్ వర్క్స్ ఇచ్చారని.. వీటికి పీపీఏ అప్రూవ్ లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట అథారిటీ అనుమతి లేనిదే ఒక్క పైసా కూడా ఎవ్వరికీ ఇవ్వలేమని.. పెంచిన అంచనాలను పీపీఏ కూడా అనుమతులిచ్చిందని తేల్చిచెప్పారు. 2018 జనవరి 11వ తేదీన అన్నింటికీ పీపీఏ అనుమతులు ఇచ్చిందని.. వైసీపీ చేసేవన్నీ ఆరోపణలేనని.. పట్టాభి స్పష్టం చేశారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు