దేశంలో పెరుగుతున్న ఆర్ధిక మాంద్యం… మోదీ విధానాలే కారణమా?

దేశంలో ఆర్ధిక మాంద్యం పెరిగిపోయిందని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతుంటే.. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ఎన్నో రకాల సంస్కరణలు జరిగాయని బీజేపీ మంత్రులు, నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ స్వయంగా చెబుతున్న బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. ఇంతకీ దేశంలో నిజంగా ఆర్ధిక మాంద్యం పెరిగిపోయిందా? ఇదే అంశంపై టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్‌ డిబేట్‌ లైవ్‌లో చర్చ జరిగింది. ప్రపంచ […]

దేశంలో పెరుగుతున్న ఆర్ధిక మాంద్యం... మోదీ విధానాలే కారణమా?
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 10:01 PM

దేశంలో ఆర్ధిక మాంద్యం పెరిగిపోయిందని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతుంటే.. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ఎన్నో రకాల సంస్కరణలు జరిగాయని బీజేపీ మంత్రులు, నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ స్వయంగా చెబుతున్న బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. ఇంతకీ దేశంలో నిజంగా ఆర్ధిక మాంద్యం పెరిగిపోయిందా? ఇదే అంశంపై టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్‌ డిబేట్‌ లైవ్‌లో చర్చ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ దాన్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని బీజేపీ నేత సత్యమూర్తి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అభిజిత్ బెనర్జీ మాత్రమే కాకుండా గతంలో అమర్త్య సేన్ కూడా చెప్పారని.. వీరంతా కుహనా మేధావులని విమర్శించారు. 2008లో కూడా ఆర్దిక మాంద్యం వచ్చిందని, అప్పడు యూపీఏ ప్రభుత్వం తమ మద్దతుతో మాంద్యాన్ని తగ్గించారని సీపీఐ జాతీయ నేత నారాయణ తెలిపారు. దేశంలో కార్మికులంతా ఉద్యమాలు చేస్తున్నారని, స్వయంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చెప్పిన విషయాలు వాస్తవమేనన్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటు సెక్టార్, కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని నారాయణ విమర్శించారు. ప్రభుత్వ విధానాలు కాకులను కొట్టి గద్దలకు వేస్తూ.. కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. ఈ దేశానికి ప్రమాదం ఏదైనా వచ్చిందంటే అది కేవలం మోదీ వల్ల మాత్రమేనంటూ ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. దేశంలో ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం ఉన్నవిషయాన్ని స్వయంగా 20 రోజుల క్రితం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని, దీనికి జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన పట్టికను గమనిస్తే దీన్ని అర్ధం చేసుకోచ్చన్నారు. అత్యధికంగా ఏప్రిల్‌లో వసూలు కాగా.. అది సెప్టెంబర్ వచ్చే సరికి 20 శాతం తగ్గిపోయిందన్నారు ఆర్ధిక రంగ నిపుణులు సాయిబాబా. ఇలా తగ్గిపోడానికి ప్రధాన కారణం ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గిపోవడమేనన్నారు. దేశంలో మొత్తం ఆర్ధిక మాంద్యం పెరిగిపోవడంపై ఆర్టిక వేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ విధంగా ఆర్ధిక మాంధ్యం పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నితాకడం సామన్యుడికి పెనుభారంగా మారింది. అయితే కార్పొరేట్ సెక్టార్‌కు బలాన్నిస్తున్న ప్రభుత్వం సామాన్యుడిని కూడా పట్టించుకోవాలని ఆర్ధిక వేత్తలు కోరుతున్నారు.

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??