ఏపీలో సీసా సెగలుపై టీడీపీ-వైసీపీ బిగ్ఫైట్
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తోంటో.. ఏపీలో మాత్రం అధికార, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన సడలింపులో మద్యం కూడా ఉండటంతో.. ఈ మాటల వార్కు ఆజ్యం పోసినట్లైంది. కేంద్ర ఇచ్చిన సడలింపుతో.. లిక్కర్ సేల్స్ దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ధరలు అమాంతం పెరిగినా.. మద్యం ప్రియులు మాత్రం కొనడానికి వెనుకడుగు వేయట్లేదు. ఫుల్ ఖుషీ ఖుషీగా కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూడా […]
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తోంటో.. ఏపీలో మాత్రం అధికార, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన సడలింపులో మద్యం కూడా ఉండటంతో.. ఈ మాటల వార్కు ఆజ్యం పోసినట్లైంది. కేంద్ర ఇచ్చిన సడలింపుతో.. లిక్కర్ సేల్స్ దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ధరలు అమాంతం పెరిగినా.. మద్యం ప్రియులు మాత్రం కొనడానికి వెనుకడుగు వేయట్లేదు. ఫుల్ ఖుషీ ఖుషీగా కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూడా సోమవారం నాడు లిక్కర్ షాపుల వద్ద భారీ క్యూలైన్లు కట్టారు. 40రోజుల తర్వాత తెరుచుకున్న షాపుల వద్ద.. ఉదయం నుంచే బారులు తీరారు జనాలు. ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నపలు రాష్ట్రాలు.. మద్యంపై భారీగా ధరలను పెంచేశాయి. అయితే ఈ క్రమంలో లిక్కర్ ధరలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ కొనసాగింది. ఈ చర్చలో ఏపీ మంత్రి పేర్ని నానీ, టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్తో పాటు.. బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఆ చర్చలో జరిగిన అంశాలను కింద ఉన్న వీడియోలో చూడండి.