‘బిగ్’బీ దాతృత్వం.. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్బీ తన దాతృత్వాన్ని చాటుకొన్నారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల రూపాయల విరాళాలను ప్రకటించారు అమితాబ్. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ‘‘అమరులైన జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5లక్షలను అమితాబ్ విరాళంగా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఫండింగ్ ఇప్పుడు జరుగుతోంది’’ అంటూ ఆయన తెలిపారు. దీంతో బిగ్బీ గొప్ప మనసుపై నెటిజన్లు […]
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్బీ తన దాతృత్వాన్ని చాటుకొన్నారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల రూపాయల విరాళాలను ప్రకటించారు అమితాబ్. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ‘‘అమరులైన జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5లక్షలను అమితాబ్ విరాళంగా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఫండింగ్ ఇప్పుడు జరుగుతోంది’’ అంటూ ఆయన తెలిపారు. దీంతో బిగ్బీ గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల సంఖ్య తాజాగా 49కు పెరిగింది. మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నట్లు డాక్టర్లు అంటున్నారు.