శ్రీరామ పట్టాభిషేకం చూతము రారండి
శ్రీరామ నవమి బ్రహోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నీరాజనాలు పలికారు. శ్రీరామ నామాలను పఠిస్తూ కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఆదివారం మిథిలా మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిజిత్ లగ్నంలో తిరు కళ్యాణం నిర్వహించారు. నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. […]
శ్రీరామ నవమి బ్రహోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నీరాజనాలు పలికారు. శ్రీరామ నామాలను పఠిస్తూ కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఆదివారం మిథిలా మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిజిత్ లగ్నంలో తిరు కళ్యాణం నిర్వహించారు. నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ రోజున మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు. అనంతరం ఆయన మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.