భద్రాచలంలో పట్టుబడిన 226.5 కేజీల గంజాయి

తాజాగా భ‌ద్రాచ‌లంలో పోలీసులు 226.5 కేజీల గంజాయిని ప‌ట్టుకున్నారు. దీని విలువ రూ. 33.97 ల‌క్ష‌లుగా అంచనా వేస్తున్నారు.  పట్టుబడిన గంజాయికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ రాజేష్ చంద్ర వెల్ల‌డించారు...

భద్రాచలంలో పట్టుబడిన 226.5 కేజీల గంజాయి
Follow us

|

Updated on: Sep 15, 2020 | 8:35 PM

గంజాయి, మత్త పదార్థాల తరలింపుపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణ మీదుగా సాగుతున్న దందాకు చెక్ పెడుతున్నారు. గత రెండు నెలలుగా పోలీసులు జరిపిన దాడుల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్లుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

తాజాగా భ‌ద్రాచ‌లంలో పోలీసులు 226.5 కేజీల గంజాయిని ప‌ట్టుకున్నారు. దీని విలువ రూ. 33.97 ల‌క్ష‌లుగా అంచనా వేస్తున్నారు.  పట్టుబడిన గంజాయికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ రాజేష్ చంద్ర వెల్ల‌డించారు. ఎస్ఐ మ‌హేశ్ త‌న సిబ్బందితో ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వ‌ద్ద వాహ‌న త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గంజాయి ర‌వాణాను గుర్తించి ప‌ట్టుకున్నారని తెలిపారు. నిందితుల‌ను ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్‌గా గుర్తించారు. గంజాయిని మిని ట్ర‌క్కులో మ‌ల్క‌న్‌గిరి నుంచి విజ‌య‌వాడ‌కు తరలిస్తున్నారని ఎఎస్పీ వెల్లడించారు.