ప్రయాణీకులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్..

అత్యవసర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం నడుపుతున్న 230 స్పెషల్ ట్రైన్స్‌లో 3 రైళ్లు మినహాయించి మిగిలిన వాటిల్లో బెర్తులు జూన్, జూలై నెలలకు గానూ అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. జూలై చివరి వారం వరకు ఈ రైళ్లలో బెర్తులు ఖాళీ ఉంటాయని.. టికెట్ బుక్ చేసుకునేవారికి ఖచ్చితంగా కన్ఫామేషన్ అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అవసరాన్ని బట్టి పలు రూట్లలో […]

ప్రయాణీకులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Jun 16, 2020 | 12:28 AM

అత్యవసర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం నడుపుతున్న 230 స్పెషల్ ట్రైన్స్‌లో 3 రైళ్లు మినహాయించి మిగిలిన వాటిల్లో బెర్తులు జూన్, జూలై నెలలకు గానూ అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. జూలై చివరి వారం వరకు ఈ రైళ్లలో బెర్తులు ఖాళీ ఉంటాయని.. టికెట్ బుక్ చేసుకునేవారికి ఖచ్చితంగా కన్ఫామేషన్ అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అవసరాన్ని బట్టి పలు రూట్లలో రైళ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రైల్వేస్టేషన్లలో తగిన చర్యలు తీసుకుంటున్నామని.. ప్రయాణీకులు అందరూ కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వీకే యాదవ్ వ్యక్తం చేశారు.