బెంగాల్ లో 23 వేల మార్క్ దాటిన కరోనా
పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 861 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 23వేలకు చేరువైంది.
ఇంతకాలం తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా కరోనా విజృంభిస్తోంది. పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 861 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 23వేలకు చేరువైంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22 మంది మరణించారు. దీంతో మొత్తం మరిణించిన వారి సంఖ్య 779కి చేరింది, ఇక సోమవారం 524 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,987కి చేరింది. ప్రస్తుతం 6,973మంది కరోనా బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా 15,235మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.