బ్యాలెట్ విషయంలో బెంగాల్ కాంగ్రెస్లో విభేదాలు!
కోల్కత్తా మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలన్న సీఎం మమతాబెనర్జీ నిర్ణయంపై బెంగాల్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఇలా చేస్తే టీఎంసీ రిగ్గింగ్కు పాల్పడే అవకాశాలున్నాయని ఒకవర్గం బలంగా వాదిస్తోంది. బీజేపీని తట్టుకోవాలంటే టీఎంసీ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేయాలని మరో వర్గం వాదిస్తోంది. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం ముఖ్యమైన అంశం. తృణమూల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగలేదు. ఎన్నికలు సక్రమంగా జరగడానికి టీఎంసీ ఎన్నడూ […]
కోల్కత్తా మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలన్న సీఎం మమతాబెనర్జీ నిర్ణయంపై బెంగాల్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఇలా చేస్తే టీఎంసీ రిగ్గింగ్కు పాల్పడే అవకాశాలున్నాయని ఒకవర్గం బలంగా వాదిస్తోంది. బీజేపీని తట్టుకోవాలంటే టీఎంసీ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేయాలని మరో వర్గం వాదిస్తోంది. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం ముఖ్యమైన అంశం. తృణమూల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగలేదు. ఎన్నికలు సక్రమంగా జరగడానికి టీఎంసీ ఎన్నడూ అనుమతినివ్వలేదని కాంగ్రెస్లోని ఓ వర్గం దుమ్మెత్తిపోస్తోంది.
ఒకవేళ ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు వస్తే మొత్తం పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడుతుందని కాంగ్రెస్ నేత సోమేన్ మిత్రా ఆరోపిస్తున్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ చేసిన దుశ్చర్యలను ఎలా మరిచిపోతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బ్యాలెట్ పేపర్ ఉన్నా లేకున్నా మొదట రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత మమతా బెనర్జీపై ఉందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.