పశ్చిమ బెంగాల్… బీజేపీ ఎమ్మెల్యే హత్యా ? ఆత్మహత్యా ?

పశ్చిమబెంగాల్ లో దేవేంద్రనాథ్ రాయ్ అనే బీజేపీ ఎమ్మెల్యే మృతదేహాన్ని ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని ఓ మార్కెట్ లో కనుగొన్నారు. అక్కడి ఓ షాపు వరండాలో ఆయన డెడ్ బాడీ ఓ తాడుకు వేలాడుతూ కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మార్కెట్ ఈ ఎమ్మెల్యే ఇంటికి..

పశ్చిమ బెంగాల్... బీజేపీ ఎమ్మెల్యే హత్యా ? ఆత్మహత్యా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 13, 2020 | 1:08 PM

పశ్చిమబెంగాల్ లో దేవేంద్రనాథ్ రాయ్ అనే బీజేపీ ఎమ్మెల్యే మృతదేహాన్ని ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని ఓ మార్కెట్ లో కనుగొన్నారు. అక్కడి ఓ షాపు వరండాలో ఆయన డెడ్ బాడీ ఓ తాడుకు వేలాడుతూ కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మార్కెట్ ఈ ఎమ్మెల్యే ఇంటికి కిలోమీటర్ దూరంలోనే ఉంది. కొందరు వ్యక్తులు ఈ తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో తమ ఇంటికి వచ్చి.. దేవేంద్రనాథ్ ని తమతో తీసుకువెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని వారు కోరారు.  దేవేంద్రనాథ్ రాయ్ ని హత్య చేశారని బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ నేతల హత్యల పరంపర కొనసాగుతూనే ఉందని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నవారిని హతమారుస్తున్నారని ఆయన అన్నారు. దేవేంద్రనాథ్.. 2016 లో సీపీఎం టికెట్ పై హేమతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతునిచ్చింది. అయితే గత ఏడాది లోక్ సభ ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరారు.