ఉసిరితో అందం.. కుంకుమతో సౌందర్యం…

ఉసిరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది…  అందానికి మరింత మేలు చేస్తుంది. ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరి, కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. 1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే […]

ఉసిరితో అందం.. కుంకుమతో సౌందర్యం...
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 1:05 AM

ఉసిరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది…  అందానికి మరింత మేలు చేస్తుంది. ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరి, కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం.

1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై ముడుతలు తొలుగుతాయి.

2. ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, బాదంపేస్ట్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు.

3. కుంకుమపువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది. కుంకుమపువ్వు, పాల మిశ్రమం ఫేస్ ప్యాక్ చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. స్కిన్ స్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తుంది. దీంతో చర్మం మరింత యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

4. కలబంద చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది. కలబంద గుజ్జు చర్మంపై ఎప్పుడూ తేమ ఉంచుతుంది. అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

5. అలోవెర, బియ్యంపిండి, టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగాలి. వారానికి మూడుసార్లు ఈ పద్ధతిని పాటిస్తే ముఖం అందంగా కనబడుతుంది.

6. పాలు, కుంకుమపువ్వు రెండింటినీ బాగా కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఐప్లె చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో చర్మానికి తగిన హైడ్రేషన్ అందుతుంది. అంతేకాకుండా చర్మానికి తగిన మాయిశ్చరైజర్ అందుతుంది. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది.