‘ ఎలుగు మనిషి ‘ ఉదంతం తుస్సుమంది

రష్యా, సైబీరియా సరిహద్దుల్లోని తువా అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దాడిలో గాయపడినట్టు వఛ్చిన వార్తలు తుస్సుమన్నాయి. 41 ఏళ్ళ అలెగ్జా‍ండ‌ర్ అనే ఈ వ్యక్తి అసలు ఎలుగు దాడిలో గాయపడలేదని, అతడు తన రోగి అని కజకిస్తాన్ లోని ఓ ఆసుపత్రి డాక్టర్ తేల్చి చెప్పాడు. రుస్తం ఇసయెవ్ అనే ఈ డాక్టర్..తన పేషంట్ సోరియాసిస్ తోను, ఇతర బ్బులతోను బాధ పడుతున్నాడని, మతి మరపుతో బాటు కొంతవరకు మతి స్థిమితం లేదని ఆయన తెలిపాడు. ఎలుగుబంటి […]

' ఎలుగు మనిషి ' ఉదంతం తుస్సుమంది
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 8:31 PM

రష్యా, సైబీరియా సరిహద్దుల్లోని తువా అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దాడిలో గాయపడినట్టు వఛ్చిన వార్తలు తుస్సుమన్నాయి. 41 ఏళ్ళ అలెగ్జా‍ండ‌ర్ అనే ఈ వ్యక్తి అసలు ఎలుగు దాడిలో గాయపడలేదని, అతడు తన రోగి అని కజకిస్తాన్ లోని ఓ ఆసుపత్రి డాక్టర్ తేల్చి చెప్పాడు. రుస్తం ఇసయెవ్ అనే ఈ డాక్టర్..తన పేషంట్ సోరియాసిస్ తోను, ఇతర బ్బులతోను బాధ పడుతున్నాడని, మతి మరపుతో బాటు కొంతవరకు మతి స్థిమితం లేదని ఆయన తెలిపాడు. ఎలుగుబంటి ఇతడ్ని గాయపరచినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించాడు. కొందరు వేటగాళ్ళు ఇతడిని ఓ ఎలుగుబంటి గుహలో చూశారని, తాను నెలరోజులుగా ఈ గుహలో ఉన్నట్టు అతగాడు చెప్పాడంటూ వారు ఓ వీడియో తీయడంతో అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇదంతా వట్టి పుకారేనని రుస్తం స్పష్టం చేశాడు. తన రోగి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, అతడ్ని అతడి తల్లి వఛ్చి వారి ఇంటికి తీసుకువెళ్ళిందని ఆయన వెల్లడించాడు. ఈ ఉదంతంలో… వీడియోను తీసినవారిపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కజకిస్తాన్ లోని యాక్తాబ్ మెడికల్ సెంటర్ అనే ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ రోగి అసలు ఆ గుహలోకి ఎలా వెళ్లాడన్నది మిస్టరీగా మారింది.