జనారణ్యంలోకి వన్యప్రాణులు.. వణికిపోతున్న కర్నూలు జిల్లా జనం..బండిఅత్మకూరు మండలంలో రైతులపై ఎలుగుబంటి దాడి
జనంలోకి క్రూరమృగాలు వస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోని పరిసరాల్లో అవి తిరగడాన్ని గమనించకపోవడంతో ప్రాణనష్టం తప్పడం లేదు. కర్నూలు జిల్లా బండిఅత్మకూరు...
Bear Attack On Farmers : జనంలోకి క్రూరమృగాలు వస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోని పరిసరాల్లో అవి తిరగడాన్ని గమనించకపోవడంతో ప్రాణనష్టం తప్పడం లేదు. కర్నూలు జిల్లా బండిఅత్మకూరు మండలం చిన్నదేళాపురం శివార్లలో ఎలుగుబంటి ఇద్దరిపై దాడి చేసింది.
నల్లమల ఫారెస్ట్కి దగ్గరలో ఉన్న తమ పొలానికి వెళ్తుండగా పుల్లంరాజు అనే రైతుతో పాటు మరో వ్యక్తిపై దాడి చేసింది. అప్పటి వరకు పొదల్లో తలదాచుకున్న ఎలుగుబంటి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దర్ని అంబులెన్స్లో నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
ఎలుగుబంటి దాడితో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. పక్కనే నల్లమల ఫారెస్ట్ ఉండటంతో ఏ పొదల్లోంచి ఏ జంతువు అటాక్ చేస్తుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. గ్రామాల్లోకి క్రూరమృగాలు రాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.