ఆర్కే బీచ్లో అదిరిపోతున్న ఏర్పాట్లు
ఏపీ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగరతీరంలో నిర్వహించనుంది. ఆర్కే బీచ్ రోడ్డులో రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ను నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సీఎం వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హాజరవుతారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 14 కమిటీలు వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రిపబ్లిక్ డే రోజు పరేడ్లో పాల్గొనే కంటెంజెంట్స్ బీచ్ రోడ్డులో సన్నద్ద కవాతు నిర్వహించారు. 8 కంటెంజెంట్స్ ఇప్పటికే విశాఖకు […]
ఏపీ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగరతీరంలో నిర్వహించనుంది. ఆర్కే బీచ్ రోడ్డులో రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ను నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సీఎం వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హాజరవుతారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 14 కమిటీలు వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు రిపబ్లిక్ డే రోజు పరేడ్లో పాల్గొనే కంటెంజెంట్స్ బీచ్ రోడ్డులో సన్నద్ద కవాతు నిర్వహించారు. 8 కంటెంజెంట్స్ ఇప్పటికే విశాఖకు చేరుకొని రిహార్సల్స్ ప్రారంభించాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా విశాఖలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలి రిపబ్లిక్ డే వేడుకలు కూడా విశాఖలోనే నిర్వహిస్తుండటం విశేషం.
రిపబ్లిక్ డే వేడుకల నేపధ్యంలో జనవరి 17 నుంచి ఈనెల 25 వరకు బీచ్రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్డులో ఉదయం 5.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆయా సమయాల్లో బీచ్రోడ్డులో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఆర్కే బీచ్ ఏరియాలో నివాసముండే వాళ్లకు రాకపోకల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతవాసులకు త్రీ టౌన్ పోలీసులు రెసిడెన్షియల్ పాస్లను అందజేస్తున్నారు.