బీసీసీఐ, వీవో భాగస్వామ్యానికి కటీఫ్ !
ఐపీఎల్-2020 టోర్నమెంట్ కోసం భాగస్వాములుగా ఉంటూ వచ్చిన బీసీసీఐ, వీవో మొబైల్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ తమ పార్ట్ నర్ షిప్ కి స్వస్తి చెప్పాయి. ఈ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నట్టు..
ఐపీఎల్-2020 టోర్నమెంట్ కోసం భాగస్వాములుగా ఉంటూ వచ్చిన బీసీసీఐ, వీవో మొబైల్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ తమ పార్ట్ నర్ షిప్ కి స్వస్తి చెప్పాయి. ఈ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తమ టైటిల్ స్పాన్సర్ గా ఈ కంపెనీని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ఐపీఎల్ గవర్ణింగ్ కౌన్సిల్’ పేర్కొన్న నేపథ్యంలో..బీసీసీఐ ఈ ప్రకటన చేయడం విశేషం. వీవోని కొనసాగించాలని బీసీసీఐ మొదట నిర్ణయించినప్పటికీ దీనిపై క్రికెట్ ప్రియుల అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయింది. అసలు లీగ్ ని బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో అనేకమంది కోరారు. తమ బోర్డుకు వీరి సెంటిమెంట్లే ముఖ్యమని భావించిన భారత క్రికెట్ బోర్డు.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా..వీవోతో స్పాన్సర్ షిప్ ని రద్దు చేయాలని భావించినట్టు కనబడుతోంది.