సైనికులకు బీసీసీఐ రూ. 20 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: సైనిక సంక్షేమ నిధికి బీసీసీఐ రూ.20 కోట్లు విరాళంగా అందజేయబోతోంది. పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విరాళాన్ని స్వీకరించేందుకు త్రివిధ దళాల్లోని అత్యున్నత అధికారులను ఆహ్వానించనున్నట్టు తెలిసింది. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం అవుతున్న మార్చి 23న ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది. పుల్వామా నేపథ్యంలో ఈ సారి వేడుకలను రద్దు చేసి అందుకు కేటాయించిన మొత్తాన్ని విరాళంగా అందిచాలని బీసీసీఐ […]
న్యూఢిల్లీ: సైనిక సంక్షేమ నిధికి బీసీసీఐ రూ.20 కోట్లు విరాళంగా అందజేయబోతోంది. పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విరాళాన్ని స్వీకరించేందుకు త్రివిధ దళాల్లోని అత్యున్నత అధికారులను ఆహ్వానించనున్నట్టు తెలిసింది. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం అవుతున్న మార్చి 23న ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది. పుల్వామా నేపథ్యంలో ఈ సారి వేడుకలను రద్దు చేసి అందుకు కేటాయించిన మొత్తాన్ని విరాళంగా అందిచాలని బీసీసీఐ నిర్ణయించింది.