సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు నోటీసులు

టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ సలహామండలిలో ఉంటూ ఐపీఎల్‌ టీమ్‌లకు మెంటర్స్‌గా పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ.. దానిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్‌కు చెందిన సంజీవ్ గుప్తా ఫిర్యాదుతో బీసీసీఐ ఈ నోటీసులు ఇచ్చింది. కాగా సచిన్ ముంబయి ఇండియన్స్ జట్టుకు, లక్ష్మణ్ సన్‌రైజర్స్ టీంకు మెంటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ […]

సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు నోటీసులు
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 5:07 PM

టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ సలహామండలిలో ఉంటూ ఐపీఎల్‌ టీమ్‌లకు మెంటర్స్‌గా పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ.. దానిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్‌కు చెందిన సంజీవ్ గుప్తా ఫిర్యాదుతో బీసీసీఐ ఈ నోటీసులు ఇచ్చింది.

కాగా సచిన్ ముంబయి ఇండియన్స్ జట్టుకు, లక్ష్మణ్ సన్‌రైజర్స్ టీంకు మెంటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 28లోపు దీనిపై రాత పూర్వక సమాధానాన్ని తెలపాలని జస్టిస్ జైన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇదే ఫిర్యాదుపై గతంలో గంగూలీకి కూడా నోటీసులు అందాయి. క్రికెట్ సలహా మండలిలో సభ్యుడిగా ఉంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటర్‌గా గంగూలీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.