క్రికెట్ లవర్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్..
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా రద్దైన ఐపీఎల్ సీజన్తో నిరుత్సాహంలో ఉన్న క్రికెట్ లవర్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది.
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా రద్దైన ఐపీఎల్ సీజన్తో నిరుత్సాహంలో ఉన్న క్రికెట్ లవర్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. జూలైలో శ్రీలంకలో టీమిండియా పర్యటిస్తుందని BCCI కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి గతంలోనే జూలైలో శ్రీలంకలో భారత్ మూడు వన్డేలు, టీ20లు ఆడేలా షెడ్యూల్ సిద్దమైంది.
కానీ దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఈ సిరీస్పై సందిగ్దత నెలకొంది. అయితే రీసెంట్గా అరుణ్ దుమాల్.. లంక టూర్ ఖచ్చితంగా ఉంటుందని.. తాము కేంద్రం గైడ్లైన్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇక ఈ సిరీస్ నిర్వహణ కోసం కఠినమైన నిబంధనలు తాయారు చేస్తామని.. అభిమానులు లేకుండానే సిరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయని అరుణ్ దుమాల్ వెల్లడించారు.
Read More:
ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!
వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్
తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..